అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ డివిజన్ పరిధిలో సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవార్ల గద్దెల వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్చైర్మన్ నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పూజలు చేశారు. పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో సమ్మక్కకు జోగిని శ్యామల మొదటి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. సమ్మక్క, సారలమ్మ కృపతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
రూ.3.30 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి శంకుస్థాపనలు చేశారు. రూ.30 లక్షల సొంత నిధులతో చోటి మసీదు కమిటీ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించారు. పటాన్చెరు ఏపీఆర్లగ్జూరియా కమ్యూనిటీలో రామాలయ పనులను పరిశీలించారు. రామాలయం, శివాలయం నిర్మాణానికి రూ.75 లక్షల విరాళం ప్రకటించారు.
