
వాషింగ్టన్ : రష్యా తయారుచేసిన అత్యాధునిక మిస్సైల్ వ్యవస్థ ఎస్–400పై అమెరికా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని కొనుగోలు చేసే దేశాలన్నింటినీ వ్యతిరేకులుగానే భావిస్తామని పెంటగాన్(యూఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ హెడ్క్వార్టర్) డిప్యూటీ సెక్రటరీ డేవిడ్ జే ట్రచెన్బర్గ్ మిడియాతో మాట్లాడారు. ఎస్–400 కొనుగోలుదార్ల జాబితాలో ఇండియా కూడా ఉండటంతో పెంటగాన్ అమెరికా తాజా ప్రకటన చర్చనీయాంశమైంది. ఆ మిస్సైల్స్ కొనుగోలుకు సంబంధించి ఇండియా గతేడాదే రష్యాతో రూ.40వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ట్రచెన్బర్గ్ ముందు విలేకరులు ప్రస్తావించారు. అందుకాయన.. డిఫెన్స్ రంగంలో ఇండియాతో భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదని, దాన్ని మరింత బలోపేతం చేసుకోడానికి ఆసక్తిగా ఉన్నామంటూనే, పరోక్షంగా ‘ఎస్–400’ కొనుగోళ్లను వ్యతిరేకించారు. ‘‘మా ఉద్దేశం ఒకటే. మేం(యూఎస్) తయారు చేసిన ఫిఫ్త్ జనరేషన్ యుద్ధవిమానం ఎఫ్–35ని నిలువరించడానికి మాత్రమే ఇతర దేశాలు రష్యా నుంచి ఎస్–400 మిస్సైళ్లను కొనడం లేదని నిర్ధారించుకోవాలని భావిస్తున్నాం. ఈ విషయంలో మా విధానాన్ని మార్చుకోము”అని పెంటగాన్ అధికారి స్పష్టం చేశారు. నాటో మెంబర్షిప్ కోల్పోవాల్సొస్తుందన్న అమెరికా వార్నింగ్ను ధిక్కరించిమరీ టర్కీ ఇటీవలే ఎస్–400 మిస్సైల్డిఫెన్స్సిస్టమ్ను ఇంపోర్ట్ చేసుకోవడం, ఆ పరిణామంతో మండిపడ్డ ప్రెసిడెంట్ ట్రంప్..
ఎఫ్–35 విమానాల్ని టర్కీకి అమ్మబోమని తేల్చిచెప్పడం తెలిసిందే.