ఎస్​-400 మిస్సైల్స్​ అంటే అమెరికాకు మంట

ఎస్​-400 మిస్సైల్స్​ అంటే అమెరికాకు మంట

వాషింగ్టన్​ : రష్యా తయారుచేసిన అత్యాధునిక మిస్సైల్​ వ్యవస్థ ఎస్​–400పై అమెరికా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని కొనుగోలు చేసే దేశాలన్నింటినీ వ్యతిరేకులుగానే భావిస్తామని పెంటగాన్​(యూఎస్​ డిఫెన్స్​ డిపార్ట్​మెంట్​ హెడ్​క్వార్టర్) డిప్యూటీ సెక్రటరీ డేవిడ్​ జే ట్రచెన్​బర్గ్​ మిడియాతో మాట్లాడారు. ఎస్​–400 కొనుగోలుదార్ల జాబితాలో ఇండియా కూడా ఉండటంతో పెంటగాన్​ అమెరికా తాజా ప్రకటన చర్చనీయాంశమైంది. ఆ మిస్సైల్స్​ కొనుగోలుకు సంబంధించి ఇండియా గతేడాదే రష్యాతో రూ.40వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ట్రచెన్​బర్గ్​ ముందు విలేకరులు ప్రస్తావించారు. అందుకాయన.. డిఫెన్స్​ రంగంలో ఇండియాతో భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదని, దాన్ని మరింత బలోపేతం చేసుకోడానికి ఆసక్తిగా ఉన్నామంటూనే, పరోక్షంగా ‘ఎస్​–400’ కొనుగోళ్లను వ్యతిరేకించారు. ‘‘మా ఉద్దేశం ఒకటే. మేం(యూఎస్​) తయారు చేసిన ఫిఫ్త్​ జనరేషన్​ యుద్ధవిమానం ఎఫ్​–35ని నిలువరించడానికి మాత్రమే ఇతర దేశాలు రష్యా నుంచి ఎస్​–400 మిస్సైళ్లను కొనడం లేదని నిర్ధారించుకోవాలని భావిస్తున్నాం. ఈ విషయంలో మా విధానాన్ని మార్చుకోము”అని పెంటగాన్​ అధికారి స్పష్టం చేశారు. నాటో మెంబర్​షిప్​ కోల్పోవాల్సొస్తుందన్న అమెరికా వార్నింగ్​ను ధిక్కరించిమరీ టర్కీ ఇటీవలే ఎస్​–400 మిస్సైల్​డిఫెన్స్​సిస్టమ్​ను ఇంపోర్ట్​ చేసుకోవడం, ఆ పరిణామంతో మండిపడ్డ ప్రెసిడెంట్​ ట్రంప్​..
ఎఫ్​–35 విమానాల్ని టర్కీకి అమ్మబోమని తేల్చిచెప్పడం తెలిసిందే.