హోస్టన్/ కౌలాలంపూర్: నెల రోజుల లాక్డౌన్ తర్వాత అమెరికాలోని రెండో పెద్ద స్టేట్ టెక్సాస్లో చిన్నచిన్న బిజినెస్లు రీ ఓపెన్ అయ్యాయి. తక్కువ ఆక్యుపెన్సీతో నడిచే వ్యాపారాలను నడిపించుకునేందుకు అక్కడి అధికారులు పర్మిషన్స్ ఇచ్చారు. దీంతో పలు రోడ్లు, షాపులు జనాలతో సందడిగా కన్పించాయి. టెక్సాస్లో శుక్రవారం నాటికి 29 వేల మందికి కరోనా సోకగా 820 మంది వరకు చనిపోయారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి టెక్సాస్లో లాక్డౌన్ నడుస్తోంది. గురువారం రాత్రి నుంచి లాక్డౌన్ ఎత్తేయడంతో రిటైల్ షాప్స్, రెస్టారెంట్స్, థియేటర్లు, మాల్స్, లైబ్రరీలు, మ్యూజియమ్స్ను 25 శాతం ఆక్యుపెన్సీతో తెరిచారు. రెండు మూడు ఫేజ్లలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తామని, ఫస్ట్ ఫేజ్రిలాక్సేషన్స్ తర్వాత పరిస్థితుల్ని అంచనా వేసి సెకండ్ ఫేజ్గురించి ఆలోచన చేస్తామని టెక్సాస్ గవర్నర్ గ్రీజ్ అబోట్వెల్లడించారు.
కాలిఫోర్నియాలో బీచ్లు క్లోజ్
లాక్డౌన్ ఉన్నప్పటికీ కాలిఫోర్నియాలోని పలు బీచ్ల్లో ఇంకా జనం తిరుగుతూనే ఉన్నారు. పోయిన వీకెండ్లో జనం బీచ్లకు భారీగా తరలిరావడంతో వాళ్లను నిలువరించడం పోలీసులకూ కష్టమైంది. దీంతో కొన్ని రోజులపాటు బీచ్లను పూర్తిగా మూసివేయాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్న్యూసన్ నిర్ణయం తీసుకున్నారు.
సడలింపులకు మలేషియా రెడీ
లాక్డౌన్లో మేజర్సడలింపులు ఇచ్చేందుకు మలేషియా సైతం రెడీ అవుతోంది. కొన్ని కండీషన్స్తో బిజినెస్ పాయింట్లు, ఇండస్ట్రీస్ను రీ ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మార్చి 18 నుంచి మలేషియాలో లాక్డౌన్ నడుస్తోంది. ఇటీవల అక్కడ కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముందు తీసుకున్న నిర్ణయం మేరకు మే 12 తేదీ వరకు లాక్డౌన్ కొనసాగాల్సి ఉంది. కానీ అంతకు ముందే స్మాల్ బిజినెస్లు, రెస్టారెంట్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించారు. కస్టమర్లకు, స్టాఫ్కు టెంపరేచర్ స్క్రీనింగ్ చేయాలని, షాప్కు వచ్చే వాళ్ల డిటైల్స్ తీసుకోవాలని షరతులు పెట్టారు.