జనవరి 28న పాలమూరుకి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా రాక

జనవరి 28న పాలమూరుకి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా రాక

పాలమూరు, వెలుగు: పార్లమెంటు స్థాయి సమీక్షా సమావేశం ఈ నెల 28న పాలమూరు జిల్లా కేంద్రంలోని రెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నారు.  ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.  

పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ముఖ్య నాయకులతో ఈ సమావేశం జరగనుంది. ఈ ఏర్పాట్లను జాతీయ కార్యవర్గ సభ్యుడు  జితేందర్ రెడ్డి , రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, జిల్లా అధ్యక్షుడు పి.  శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.