అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 12న ఆయన హైదరాబాద్​కు రానున్నారు. హకీంపేట్​లో జరిగే సీఐఎస్ఎఫ్ ప్రోగ్రామ్​లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం సంగారెడ్డికి వెళ్తారు. అక్కడ వివిధ రంగాలకు చెందిన మేధావులతో అమిత్ షా సమావేశమవనున్నారు.  ఆ తర్వాత అదే రోజు సాయంత్రం కర్నాటకలోని బీదర్​కు చేరుకుంటారు. అమిత్ షా తెలంగాణ టూర్​కు సంబంధించిన ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమై చర్చించారు.