
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 12న ఆయన హైదరాబాద్కు రానున్నారు. హకీంపేట్లో జరిగే సీఐఎస్ఎఫ్ ప్రోగ్రామ్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం సంగారెడ్డికి వెళ్తారు. అక్కడ వివిధ రంగాలకు చెందిన మేధావులతో అమిత్ షా సమావేశమవనున్నారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం కర్నాటకలోని బీదర్కు చేరుకుంటారు. అమిత్ షా తెలంగాణ టూర్కు సంబంధించిన ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమై చర్చించారు.