Amol Kale: ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నుమూత

Amol Kale: ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నుమూత

ముంబై క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు అమోల్ కాలే  కన్ను మూశారు. 47 సంవత్సరాల వయస్సులో న్యూయార్క్‌లో ఆయన  గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం సెక్రటరీ అజింక్యా నాయక్, ఆఫీస్ బేరర్ సూరజ్ సమత్‌తో సహా MCAలోని ఇతర సభ్యులతో కలిసి ఆదివారం న్యూయార్క్‌లో ఇండియా -పాకిస్తాన్ మ్యాచ్‌ను కాలే వీక్షించిన తర్వాత ఆయన మరణించడం జరుగింది. 

అక్టోబర్ 2022లో జరిగిన ముంబై అసోసియేషన్ ఎన్నికల్లో మాజీ భారత ఆటగాడు సందీప్ పాటిల్‌ను ఓడించి కాలే MCA ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. రానున్న సీజన్‌లో ముంబై సీనియర్ మెన్స్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. కాలే ఆధ్వర్యంలో ముంబై 2023-24 సీజన్‌లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది.