మనీ ల్యాండరింగ్ కింద ఆమ్వే ఇండియా ఎంటర్ ప్రైజెస్కు చెందిన రూ.757.77 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. తమిళనాడు దిండిగల్లోని ప్లాంట్స్, మిషనరీ, వెహికల్స్, బ్యాంక్ బ్యాలెన్స్ను అటాచ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే రూ.345.94 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.411.83 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ- లెవల్ మార్కెటింగ్ నెట్వర్క్ పేరుతో ఆమ్వే వ్యాపారం చేస్తోంది.
న్యూఢిల్లీ: మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వేకు చెందిన రూ.757.77 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. మల్టీ-లెవల్ మార్కెటింగ్ స్కామ్ను నడుపుతున్నందుకు ఈ కంపెనీపై మనీలాండరింగ్ కేసు పెట్టామని తెలిపింది. అటాచ్ చేసిన ఆస్తులలో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆమ్వే భూమి, ఫ్యాక్టరీ బిల్డింగ్, ప్లాంట్ & మెషినరీలు, వెహికల్స్, బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆమ్వేకి చెందిన 36 ఖాతాల నుంచి రూ. 411.83 కోట్ల విలువైన స్థిరచరాస్తులను, రూ. 345.94 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్లను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ-లెవల్ మార్కెటింగ్ నెట్వర్క్ ముసుగులో ఆమ్వే పిరమిడ్ స్కామ్ను నడుపుతోందని ఈడీ దర్యాప్తులో తేలింది. మార్కెట్లో లభించే ప్రముఖ బ్రాండ్ల వస్తువులతో పోలిస్తే కంపెనీ అందించే చాలా ఉత్పత్తుల ధరలు చాలా ఎక్కువ. ఆమ్వే జనాన్ని కంపెనీలో సభ్యులుగా చేర్పించి, ఎక్కువ ధరలకు తన వస్తువులను కొనిపిస్తోందని ఈడీ ఆరోపించింది. కొత్త సభ్యులు వాటిని ఉపయోగించడానికి కాకుండా ఆఫ్లైన్ మెంబర్లు మరింత సంపాదించడానికి కొనాల్సి వస్తోందని వివరించింది.