పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం 

పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం 
  • దొరికిందని పూజలు

బషీర్ బాగ్, వెలుగు : కొన్నేళ్లుగా మూసి ఉన్న రాంకోఠి శక్తి గణపతి ఆలయం పక్కనే ఉన్న భవనంలో తవ్వకాలు జరపగా, శ్రీకృష్ణుడి విగ్రహం బయట పడిందనే పుకారు రావడంతో శుక్రవారం ఉదయం పలువురు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్​గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత మేర గుంతను తవ్వి, విగ్రహాన్ని పక్కన పెట్టి వెళ్లారు. సుల్తాన్ బజార్ పోలీసులు అక్కడికి చేరుకొని, స్థానికులను అడిగి వివరాలు సేకరించారు.

సదరు భవనంలో గతంలో ఆమ్రత్ కపడియా నవ్ జీవన్ విమెన్స్ కాలేజీ నడుస్తుండేదని.. కొన్నేళ్లుగా కోర్టు కేసు నడుస్తుండడంతో భవనం క్లోజ్​చేశారని తెలిసింది. ఎవరో ఉద్దేశపూర్వకంగా తవ్వకాలు జరిపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెట్టారని పోలీసులు గుర్తించారు. అందరినీ పంపించివేసి, భవనం గేటుకు తాళం వేశారు.