- 4 వేల మంది అమెరికన్లకు ధోకా..
- ఇండియన్కు 22 ఏళ్ల జైలు
వాషింగ్టన్: నాలుగు వేల మంది అమెరికన్లను కోటి డాలర్లకు (సుమారు రూ.72.47 కోట్లు) మోసం చేసిన ఓ ఇండియన్కు అమెరికా కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. షెహ్జాద్ ఖాన్ (40) అనే వ్యక్తి అహ్మదాబాద్లో ఓ కాల్ సెంటర్ నిర్వహించేవాడు. దాని నుంచి అమెరికన్లకు ఆటోమేటెడ్ రోబో కాల్స్ చేయించేవాడు. ఎఫ్బీఐ అధికారులమని, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులమని చెప్పి వారిని బెదిరించేవాడు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, జరిమానాలు కట్టాలని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. ఆ నేరం కోర్టులో నిరూపణ కావడంతో జైలు శిక్ష పడింది. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో శిక్ష పడిన నాలుగో వ్యక్తి షెహ్జాద్. ఇలాంటి మరో కేసులో అమెరికాలో ఉంటున్న మరో ఇండియన్కు 20 ఏండ్ల శిక్షపడింది. హ్యూస్టన్లో అక్రమంగా బతుకుతున్న వసీమ్ మక్నోజియా (37) అనే వ్యక్తి.. టెలీమార్కెటింగ్ స్కీమ్లో భాగంగా 2019 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య అమెరికన్లను మోసం చేసినట్లు నేరం రుజువైంది. తప్పుడు పేర్లతో 70 డబ్బు పార్శిళ్లను తీసుకున్నాడని, అతడి శిక్షపై డిసెంబర్లో కోర్టు తీర్పునిస్తుందన్నారు.