గుంటూరు కారం పాటపై రష్మీ ఫైర్.. అలాంటివేం జరగలేదట!

గుంటూరు కారం పాటపై రష్మీ ఫైర్.. అలాంటివేం జరగలేదట!

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కించిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela), మానాక్షి చౌదరి(Meenakshi Chaudary) హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా అక్కడ మంచి స్పందన తెచ్చుకుంది. 

ఇక ఈ సినిమాలో ఈ సినిమాలో కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పక్కా మాస్ బీట్ తో వచ్చిన ఈ పాటకు థియేటర్స్ ఊగిపోయాయి. మాస్ ఆడియన్స్ అయితే రచ్చ రచ్చ చేశారు. ఈ పాటలో నటి పూర్ణ కనిపించిన విషయం తెలిసిందే. చిన్న చిన్న మాస్ స్టెప్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు పూర్ణ. నిజానికి ఈ పాటలో పూర్ణ స్థానంలో ముందుగా రష్మీని అడగగా.. నో చెప్పిందట రష్మీ. ఈ వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: ఇండియాలోకి ఆపిల్ విజన్ ప్రో.. ఫోటోలు వైరల్..

 అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించారు రష్మీ.. ఇలాంటి ఫేక్ వార్తలు ఎవరు క్రియేట్ చేస్తారో అర్థంకాదు. గుంటూరు కారం పాట విషయంలో నన్ను ఎవరు సంప్రదించలేదు. నేను రిజెక్ట్ చేయలేదు. ఆ పాటలో పూర్ణ గారు అద్భుతంగా చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి నెగెటివ్ చేయకండి.. అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు రష్మీ. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.