విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మూడు రోజులు పొడిగింపు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మూడు రోజులు పొడిగింపు

పాఠశాల విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి 22న స్కూల్స్ తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

మొదట జనవరి 11 నుంచి జనవరి 16వ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే దీనిపై ఏపీ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో కనీసం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చేవారని.. ఇప్పుడు సెలవులు తగ్గించడం సరికాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. వెంటనే మునుపటి ప్రకటనను సవరిస్తూ జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు మరోసారి పండుగ అయిపోయన వెంటనే పిల్లలు పాఠశాలకు రాలేరని వినతులు అందడంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  కాగా, తెలంగాణలో యథావిధిగా జనవరి 17(బుధవారం) పాఠశాలలు తెరుచుకున్నాయి.