ఏపీకి 5.2 లక్షల కోట్ల పెట్టుబడులు

ఏపీకి 5.2 లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఏపీ నగరం విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేవలం రెండు రోజుల్లోనే రెన్యూవబుల్ సెక్టార్‌‌‌‌లో రాష్ట్రానికి రూ. 5.2 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు లభించాయని  ఆ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి రవికుమార్​ ప్రకటించారు. 

ఈ పెట్టుబడుల ద్వారా 2.6 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ నెల  13న రూ. 2.94 లక్షల కోట్ల ఒప్పందాలు, నవంబర్ 14న రూ. 2.2 లక్షల కోట్ల ఒప్పందాలు ఖరారయ్యాయి. ఈ పెట్టుబడులు పునరుత్పాదక ఇంధనం, గ్రీన్​ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజీ, బయోఫ్యూయెల్స్  ప్రాజెక్టులకు సంబంధించినవి.