భువనగిరి ఖిల్లాపై ఎగిరేది కాంగ్రెస్​ జెండానే: అనిల్​కుమార్​ రెడ్డి

భువనగిరి ఖిల్లాపై ఎగిరేది కాంగ్రెస్​ జెండానే: అనిల్​కుమార్​ రెడ్డి

యాదాద్రి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్​ జెండా ఎగరబోతోందని ఆ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  శుక్రవారం భువనగిరి, వలిగొండ, బీబీనగర్​ మండలాల్లోని పలు గ్రామాల్లో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు గడిచినా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​గెలవడం ఖాయమని చెప్పారు.

తాను గెలవగానే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ఈ సందర్భంగా భువనగిరి, బీబీనగర్​, వలిగొండ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు యశోధ, రజిత సహా పలువురు బీఆర్​ఎస్ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు.