టిట్​ బిట్స్​ .. ఐఎన్​ఎస్​ వింధ్యగిరి

టిట్​  బిట్స్​ ..  ఐఎన్​ఎస్​ వింధ్యగిరి

భారత నౌకాదళంలోకి మరో అధునాతన స్వదేశీ యుద్ధనౌక ఐఎన్​ఎస్ వింధ్యగిరి చేరింది. పశ్చిమబెంగాల్​ రాజధాని కోల్​కతాలోని హుగ్లీ నదీ తీరంలోని రీచ్​ షిప్​యార్డులో ఈ నౌకను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా భారత నౌకాదళంలోకి ప్రవేశ పెట్టారు. 

  • శత్రు దేశ రాడార్లకు చిక్కకుండా స్వదేశీ పరిజ్ఞానంతో ఏడు యుద్ధ నౌకలను తయారు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రాజెక్ట్​ 17 ఆల్పా చేపట్టింది. 2019–22 వరకు ఐదు యుద్ధ నౌకలను నిర్మించి, నౌకాదళానికి అప్పగించారు. ఇందులో వింధ్యగిరి ఐదో  యుద్ధనౌక. 
  • గైడెడ్​ క్షిపణులను ప్రయోగించ గల సామర్థ్యం ఉన్న ఈ నౌక పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు. ఇది గంటకు 28 నాటికల్​ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 
  • పీ17ఏ రకం ఈ యుద్ధ నౌకల్లో గైడెడ్​ మిస్సైళ్లు ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపలి నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలవు. 
  • కర్ణాటకలోని పర్వత శ్రేణి పేరిట దీనికి వింధ్యగిరి అని పేరు పెట్టారు. 
  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్​ఎస్​ వింధ్యగిరి యుద్ధనౌకను కోల్​కతాలోని గార్డెన్ రీచ్​ షిప్​ బిల్డర్స్​ అండ్​ ఇంజినీర్స్​ నిర్మించింది. ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75 శాతం వరకు దేశీయంగా తయారయ్యాయి. 

రాజులు, విదేశీ యాత్రికులు

రాజు    సందర్శించిన విదేశీ యాత్రికుడు
చంద్రగుప్త మౌర్య    మెగస్తనీస్​ (గ్రీకు)
చంద్రగుప్త–2    ఫాహియాన్​
హర్షవర్ధనుడు    హ్యూయన్​త్సాంగ్​ (చైనా)
నరసింహవర్మ–1    హ్యూయన్​త్సాంగ్​ (చైనా)
మిహిరభోజుడు    సులేమాన్​ (అరబ్​)
పులకేశి–2    హ్యూమన్​త్సాంగ్ (చైనా)
అమోఘవర్షుడు    సులేమాన్​ (అరబ్​ యాత్రికుడు)
ఇంద్రుడు–3    అల్​ మసూది (అరబ్​ యాత్రికుడు)
రుద్రమదేవి    మార్కోపోలో (వెనిస్​ యాత్రికుడు)
సుల్తాన్​ మహ్మద్​ కుతుబ్​షా    మీర్​ జైనుల్​ అబిదిన్​ (పర్షియా)
అబ్దుల్లా కుతుబ్​ షా    ట్రావెర్నియర్​
మొదటి దేవరాయలు    నికోలాయ్​కోంటీ (ఇటలీ)
రెండో దేవరాయలు    అబ్దుల్​ రజాక్​ (పర్షియా)
శ్రీకృష్ణదేవరాయలు    డిమింగోఓ ఫేజ్​ (పోర్చుగీసు)