కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ... ఇదే దర్శకుడితో మరో సినిమాకు ప్లాన్ చేసింది. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో మైత్రి సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల లీడ్ రోల్స్లో రూపొందనున్న ఈ హారర్ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
భయంతో కూడిన ఓ గ్రామం, అక్కడి మెడికల్ కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్, మూఢనమ్మకాల నేపథ్యంలో ఓ అంతు చిక్కని రహస్యంతో కూడిన సరికొత్త కథతో ప్రేక్షకులను ఈ చిత్రం థ్రిల్ చేయబోతోందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మోహన్ బి.ఎస్ డైలాగ్స్ రాస్తుండగా అనిల్ యెర్నేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, దినేష్ దివాకరన్ డీవోపీగా, వెంకీ జి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
