ఆంథెమ్ ఐపీఓ జులై 14న.. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ 11 నుంచే

ఆంథెమ్ ఐపీఓ జులై 14న.. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ 11 నుంచే

న్యూఢిల్లీ: ఆంథెమ్ బయోసైన్సెస్ తన రూ. 3,395 కోట్ల ఇనీషియల్​ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జూలై 14న ప్రారంభించనుంది. ఇది 16న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒక రోజు బిడ్డింగ్ జులై 11న నిర్వహిస్తారు. ఇది పూర్తిగా ఓఎఫ్​ఎస్​విధానంలో ఉంటుంది. ఫ్రెష్​ఇష్యూ లేదు. 

ప్రమోటర్లు, పెట్టుబడిదారులు, వాటాదారులు రూ. 3,395 కోట్ల విలువైన షేర్లను అమ్ముతారు. కంపెనీకి ఈ ఇష్యూ నుంచి  నిధులు లభించవు. మొత్తం  ఆదాయం వాటాదారులకే వెళ్తుంది.