
తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పనిచేసే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇక నుంచి ‘ఈగల్’ అని పిలవనున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రద్ద ఎలాగైతే పైనుంచి చూసి టార్గెట్ మిస్సవ్వకుండా ఎటాక్ చేస్తుందో అదే మాదిరిగా ఈగల్.. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు అమ్మే వారిపై టార్గెట్ చేసి కట్టడి చేస్తుందని తెలిపారు. ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్ మెంట్( Eagle - Elite Action Group for Drug Law Enforcement ) అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడేందుకు ‘ఈగల్’ అనే ఆర్గనైషన్ గా క్రియేట్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ లో ఉన్న ఒక కోటి 50 లక్షల ఎకరాలలో ఎక్కడ గంజాయి పండించినా ఈగల్ కట్టడి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
డ్రగ్స్ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని.. ప్రభుత్వమో, పోలీసులో తలచుకుంటేనే డ్రగ్స్ నిర్మూలన జరగదని.. అందరూ భాగస్వామ్యం అయినప్పుడే డ్రగ్స్ కట్టడి చేయవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ టార్గెట్ బెంగళూర్, ముంబై, ఢిల్లీ కాదని.. తమ టార్గెట్ న్యూయార్క్ అని అన్నారు. న్యూయార్క్ స్థాయిలో డెవలప్ చేసేందుకు తెలంగాణలో 68 శాతం యువత ఉందని అన్నారు. యువతకు నైపుణ్యాల కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో నిలబెడతామని ఈ సందర్భంగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
ALSO READ | హైదరాబాద్లో యాంటీ డ్రగ్స్ డే.. హాజరైన సీఎం రేవంత్, రామ్ చరణ్, విజయ్ దేవర కొండ
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఇంటర్నేషన్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథతిగా హాజరయ్యారు సీఎం రేవంత్. సినీ నటులు రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, చేవెళ్ల బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ కామెంట్స్:
- తెలంగాణకు గొప్ప చరిత్ర ఉంది
- భూమి కోసం మన ఉద్యమాలు జరిగాయి
- ఆ పోరాం నుంచే తెలంగాణ ఉద్యమం
- రెండవ సీఎంగా బాధ్యతలు తీసుకున్నచెప్పిన.. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు వినియోగిస్తే వెన్ను విరుస్తాం అని..
- చరణ్ కు బ్యాగ్రౌండ్ ఉన్నా.. అతని తండ్రి చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా దేశం గర్వించే స్థాయికి వచ్చారంటే.. కఠోరమైన శ్రమ..
- చిరంజీవి ఏ రోజు బాధకు కుంగిపోలేదు.. బాధతో వ్యసనాలవైపు వెళ్లలేదు
- ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పాఠశాల నుంచి కళాశాల వరకు గంజాయి లేదా డ్రగ్స్ బానిసలు అవుతుంటే చూసుకుంటూ ఉందామా..?
- 140 కోట్ల జనాభా ఉన్న ఇండియా ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేదంటే అవమానం కాదా
- 68 శాతం యువత ఉన్న దేశం భారత దేశం.. గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఆలోచించాలి
- గంజాయికి బానిసలం అయితే దేశం ఎదుగుతుందా
- ఈ దేశాన్ని ఎదుర్కోలేం అని అనుకునే కొందరు.. యుద్ధం చేయొచ్చు.. కోవిడ్ పంపొచ్చు.. డ్రగ్స్ పంపొచ్చు.. ఆ ట్రాప్ లో పడదామా
- దేశ రక్షణకు ఉక్కు కవచంలా నిలిచిన పంజాబ్ డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతోంది..
- అక్కడి యువత గంజాయి, డ్రగ్స్ తో నాశనం అవుతున్నారు..
- ఒకప్పుడు యుద్ధం అంటే పంజాబ్ వీరులు.. అలాంటి పంజాబ్ నిర్వీర్యం అవుతోంది..
- అంటే ఎంత వేగంగా ఈ మహమ్మారి వ్యాపిస్తుందో ఆలోచించండి
- డిసెంబర్ 7 బాధ్యత తీసుకున్న తర్వాత.. మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులు దాటొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం..
- విజయ్, రాంచరణ్ ఎంత బిజీగా ఉన్నా.. యువతకు స్ఫూర్తిగా ఉండాలని వచ్చారు
- ఏ పాలసీ లేని తెలంగాణకు స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం..
- యువతను దారిలో పెట్టేందుకు.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
- యువతకు పట్టాలు ఇస్తున్నాం కాని.. స్కిల్స్ ఇవ్వలేక పోతున్నాం
- డిమాండ్, సప్లై ఫుల్ ఫిల్ చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ..
- ఒలింపిక్స్ చూసిన తర్వాత.. సౌత్ కొరియా.. హైదరాబాద్ జనాభా అంత ఉన్న ఆ దేశం 32 గోల్డ్ మెడల్స్ సాధించింది..
- అందులో ఒకే ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చాయి..
- ఆ దేశంతో మనం పోటీ పడలేకపోతున్నం అంటే ఆలోచించాలి
- ఆస్ట్రేలియా, కొరియన్ యూనివర్సిటీల నుంచి నిపుణులను రప్పించి.. ప్రపంచంలో నే స్పోర్ట్స్ లో రాణించేందుకు ..
- ప్రపంచం దేశాలనుంచి ఇక్కడికి శిక్షణకు వచ్చేలా తయారు చేస్తాం
- అందుకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్..
- ఇందులో భాగంగా 22 సంవత్సరాలలో 3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్లాలి
- యువతకు శిక్షణ ఇవ్వాలి.. గొప్పవాళ్లు కావాలని ట్రై చేస్తున్నాం
- ఇదంతా సాధించాలంటే యువత భాగస్వామ్యం అవ్వాలి
- డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి..
- యువత బాగుపడితే రాష్ట్రం, దేశం బాగు పడతాయి