అడిగి అడిగి అలిసిపోయా.. కానీ తప్పలేదు

అడిగి అడిగి అలిసిపోయా.. కానీ తప్పలేదు

సౌత్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ పై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. విక్రమ్తో తానూ తీయాలనుకున్న సినిమా కెన్నెడీ ని  రాహుల్ భట్ తో తీసానని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఈ సినిమాలో రాహుల్ భట్, సన్నీ లియోన్, అభిలాష్ తప్లియాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక అయ్యింది. మిడ్‌నైట్ స్క్రీనింగ్ కోసం ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు నిర్వాహకులు.

 ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న ఈ చిత్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్.. కెన్నెడీ  సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.  "వాస్తవానికి ఈ సినిమాను రాహుల్ భట్ తో చేయాలనుకోలేదని, వేరే హీరోను ఊహించుకుని ఈ సినిమా కథను రాసినట్లు తెలిపాడు. అందుకే ఈ చిత్రానికి ‘కెన్నెడీ’ అనే పేరు పెట్టానని చెప్పుకొచ్చాడు. అనురాగ్ కశ్యప్ ఊహించుకున్న ఆ హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో విక్రమ్.  నిజానికి విక్రమ్ అసలు పేరు కెన్నెడీ. ఆయనను హీరోగా భావించి ఈ సినిమా కథను రాశారు కాబట్టి ఈ చిత్రానికి ‘కెన్నెడీ’ అని పేరు పెట్టారు. కథ పూర్తయ్యాక ముందు విక్రమ్ నే సంప్రదించినట్లు అనురాగ్ తెలిపారు.

 అయితే, తాను ఎన్నిసార్లు సంప్రదించినా, విక్రమ్ స్పందించకపోవడంతో రాహుల్ భట్ ను హీరోగా తీసుకున్నట్లు చెప్పాడ. ఇక ఈ సినిమా కోసం రాహుల్ ఏకంగా 8 నెలల సమయం కేటాయించినట్లు అనురాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.