హైదరాబాద్, వెలుగు : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్కు ఆంధ్రప్రదేశ్ డుమ్మా కొట్టింది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఉన్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించే మీటింగ్కు రాలేమని మూడు రోజుల క్రితమే బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ రాశారు. అయితే, సమావేశంలో కీలక అంశాలు చర్చించాల్సి ఉందని, తప్పకుండా హాజరుకావాలని బోర్డు మెంబర్సెక్రటరీ మళ్లీ లేఖ రాశారు.
మంగళవారం హైదరాబాద్ జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ముకేశ్కుమార్సిన్హా అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు తెలంగాణ ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్, ఇంటర్స్టేట్సీఈ శంకర్నాయక్, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్హాజరయ్యారు. ఏపీ అధికారుల కోసం కొంత సేపు వెయిట్చేశారు. అనంతరం వారిని సంప్రదించగా తాము రాలేమని చెప్పడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని చైర్మన్ప్రకటించారు. మార్చి ఒకటో తేదీ తర్వాతనే మీటింగ్ఏర్పాటు చేయాలని ఏపీ అధికారులు బోర్డుకు సమాచారం ఇచ్చారు.
దీంతో మార్చి ఒకటో తేదీన నిర్వహించే సమావేశానికి రావాలని కోరుతూ మంగళవారం బోర్డు అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులు, ఇంజినీర్లకు తెలిపారు. గోదావరి జలాలను ఇంటర్స్టేట్వాటర్డిస్ప్యూట్స్యాక్ట్–1956లోని సెక్షన్–3 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాలని ఏపీ కోరుతోంది. ఈ అంశంతో పాటు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు వినియోగించే నీళ్లు, ప్రాజెక్టులకు అనుమతులు, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్ఇష్యూస్పై జీఆర్ఎంబీ సమావేశంలో చర్చించాల్సి ఉంది. వివిధ కారణాలతో ఈ సమావేశం వాయిదా పడుతోంది. మార్చి ఒకటో తేదీన కూడా బోర్డు సమావేశం నిర్వహించే అవకాశం కనిపించడం లేదు.