తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్తానన్నారు. తాను వైసీపీలో లేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ రాగానే తప్పకుండా వెళ్తానన్నారు.
ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ ప్రచారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మంగళవారం ( జనవరి 30) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి వెళ్తానని చెప్పుకొచ్చారు. తాను వైసీపీలో లేనన్న విషయాన్ని సురేఖ గుర్తు చేశారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు.
గతంలో హరితహారం పేరిట అనేక అక్రమాలు జరిగాయని.. దీని గురించి చర్చించి మళ్లీ మాట్లాడుతామని తెలిపారు. హరితహారం కొనసాగించాలా..? వద్దా..? అన్నది సీఎం నిర్ణయమన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మంత్రి సురేఖ ఆరోపించారు.