
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్ లా పని చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ కు గవర్నర్ బిశ్వ భూషణ్ చెప్రాసీలా మారారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎంతో అనుభవమున్న గవర్నర్ చిల్లర వ్యాపారిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో గవర్నర్ సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపించారు. అంతేకాకుండా మొత్తం గవర్నర్ వ్యవస్థనే రద్ధు చేయాలని, ఈ వ్యవస్థ వల్ల వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందన్నారు.