టైం మీరు ఫిక్స్ చేసిన సరే నన్ను ఫిక్స్ చేయమన్న సరే.. : షర్మిల

టైం మీరు ఫిక్స్ చేసిన సరే నన్ను ఫిక్స్ చేయమన్న సరే.. : షర్మిల

మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. తనకు అభివృద్ధి గురించి చూపిస్తా అని సుబ్బారెడ్డి సవాల్ విసిరారని మీరు చేసిన అభివృద్ధి చూడటానికి తాను సిద్ధం ఉన్నానని షర్మిల అన్నారు. మీరు చేసిన అభివృద్ధి చూపించండని డిమాండ్ చేశారు. డేట్,టైం మీరు చెప్పినా సరే లేక నన్ను చెప్పమన్నా సరే మేధావులను కూడా పిలిచి అందరం కలిసి పరీక్షిద్దామని అన్నారు. 

తనతో పాటు మీడియా వస్తుంది..ప్రతిపక్షాలు వస్తాయని అందరం కలిసి వైసీపీ చేసిన అభివృద్ది చూద్దామని షర్మిల అన్నారు.  వైసీపీ చేసిన అభివృద్ధి ఎక్కడా? చెప్పిన రాజధాని ఎక్కడా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా అని నిలదీశారు. మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుందని ఖచ్చితంగా వైవీ సుబ్బారెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నానని షర్మిల అన్నారు.