
హైదరాబాద్, వెలుగు: గుండె ఆపరేషన్లు చేయించుకుంటున్న రోగుల కోసం 'హోమ్ డిశ్చార్జెస్' అనే కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్ ప్రవేశపెట్టింది. ఈ విధానంలో కార్డియాక్ రోగులకు అడ్మిషన్ మొదలుకొని పూర్తిగా కోలుకునే వరకు ఎండ్ - టు - ఎండ్ కేర్ను అందజేస్తోంది. ఈ రెండు వారాల కార్యక్రమంలో ఫాస్టర్ రికవరీ, రౌండ్ - ది - క్లాక్ కేర్, డాక్టర్ల సలహాల వంటి సేవలను పొందవచ్చని ఈ సందర్భంగా అపోలో గ్రూప్ జేఎమ్డీ డాక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న సౌలభ్యం, సపోర్ట్ ఇంట్లోనూ అందుబాటులో ఉండటమే ఈ విధానం ప్రత్యేకత అని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.