మన దేశంలోనే యాపిల్ ​విడిభాగాల తయారీ

మన దేశంలోనే యాపిల్ ​విడిభాగాల తయారీ

న్యూఢిల్లీ: యాపిల్ మన దేశంలో తన దేశీయ విడిభాగాల తయారీని పెంచడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో చర్చించిందని సంబంధిత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "జులైలో ఒక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాపిల్​ ఒక  ప్రదర్శన ఇచ్చింది. ప్రభుత్వానికి తన ఆలోచనలను తెలియజేసింది. యాపిల్ దాని దేశీయ వీడి భాగాల ఉత్పత్తిని పెంచడానికి ఆసక్తిగా ఉంది.

సప్లయ్ చైన్,  ఇండిజనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఈ సమావేశం దృష్టి సారించింది. స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ తయారీ పరిశ్రమ గురించి కూడా ఈ సందర్భంగా చర్చలు జరిగాయి” అని ఆ అధికారి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పన్ను ప్రోత్సాహకాల గురించి ప్రస్తావన రాలేదని ఆయన తెలిపారు. గత నెలలో యాపిల్ సీనియర్ నాయకత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై దాని ప్రస్తుత తయారీ, సరఫరా గొలుసులు, ఎగుమతులు వంటి అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చింది.

ఇది తన తయారీ సామర్థ్యాలను చైనాయేతర దేశాలకు విస్తరించడంలో భాగంగా భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కీలకమైన తయారీ కేంద్రంగా చూస్తోంది. కంపెనీ ఐఫోన్ యూనిట్ల స్థానిక ఉత్పత్తి కోసం ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్, విస్ట్రాన్,  పెగాట్రాన్ వంటి కాంట్రాక్ట్ తయారీదారులపై ఆధారపడుతోంది. కాంపోనెంట్ సరఫరాదారుల్లో ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్, ఫ్లెక్స్, సాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాంప్, అవరీ, సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడా,  జాబిల్ వంటివి ఉన్నాయి. యాపిల్​దాదాపు 7 శాతం ఐఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇండియాలో తయారు చేస్తోంది