ఖమ్మం టౌన్,వెలుగు : గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు వచ్చే ఏడాది జనవరి 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు, గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ , బీసీ, జనరల్ గురుకుల బాలికల, బాలుర పాఠశాలల్లో 2026-–27 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతులలో (ఇంగ్లీష్ మీడియం) ఖాళీ సీట్లలో ప్రవేవానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
వివరాలకు https://tgcet.cgg.gov.in ను పరిశీలించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, జడ్పీ సీఈఓ దీక్ష రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, సోషల్ వెల్ఫేర్ డీసీఓ జ్యోతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
