ప్రజాపాలనకు నోడల్‌ ఆఫీసర్ల నియామకం

ప్రజాపాలనకు నోడల్‌ ఆఫీసర్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్‌ అధికారులను అపాయింట్ చేస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌-కు ఎం. ప్రశాంత్‌, కరీంనగర్ కు  శ్రీదేవసేన, నిజామాబాద్‌-కు  క్రిస్టినా జడ్​ చోంగ్తూ, వరంగల్‌ కు వాకాటి కరుణ, మెదక్‌ కు ఎస్‌. సంగీత, హైదరాబాద్‌ కు  కె.నిర్మల, రంగారెడ్డికి  ఇ.శ్రీధర్‌, మహబూబ్‌నగర్‌కు  టి.కె.శ్రీదేవి, నల్గొండకు ఆర్వీ కర్ణన్‌, ఖమ్మంకు  ఎం.రఘునందన్‌రావును నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులిచ్చారు.