
పారిస్: వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్తో హిస్టరీ క్రియేట్ చేసిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ నేతృత్వంలోని ఇండియా విమెన్స్ కాంపౌండ్ ఆర్చరీ టీమ్ మరో బంగారు పతకానికి అడుగు దూరంలో నిలిచింది. పారిస్లో జరుగుతున్న వరల్డ్ కప్ స్టేజ్4లో విమెన్స్ టీమ్తో పాటు మెన్స్ కాంపౌండ్ టీమ్ ఫైనల్ చేరుకుంది. బుధవారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ సెమీస్లో జ్యోతి సురేఖ–అదితి స్వామి–పర్నీత్ కౌర్తో కూడిన ఇండియా 234–233తో గ్రేట్ బ్రిటన్పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అంతకుముందు క్వార్టర్స్లో 233–230తో ఇస్తోనియాను ఓడించింది. మెన్స్ సెమీఫైనల్లో అభిషేక్ వర్మ– ఒజాస్ దియోతలే–ప్రథమేష్ జావ్కర్తో కూడిన ఇండియా షూటాఫ్లో కొరియాపై నెగ్గి ఫైనల్ చేరింది. శనివారం జరిగే ఫైనల్స్లో విమెన్స్ టీమ్ మెక్సికోతో, మెన్స్ టీమ్ అమెరికాతో పోటీ పడనుంది.