ఆర్మూర్ సిద్ధులగుట్టపై పూజలు, పల్లకీ సేవ, అన్నదానం

ఆర్మూర్ సిద్ధులగుట్టపై పూజలు, పల్లకీ సేవ, అన్నదానం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ టౌన్​లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప, దత్తాత్రేయ మందిరాల్లో పురోహితులు నందీశ్వర మహారాజ్​, కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. 

ఈ సందర్భంగా రామాలయం నుంచి జీవ కోనేరు వరకు ఉత్సవ మూర్తులతో పల్లకీ సేవ జరిగింది. భక్తులు భజన కీర్తనలు చేశారు. అనంతరం రాజస్థాన్​ స్వీట్ హోమ్​ అధినేత బన్సిలాల్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మందిర కమిటీ ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.