కామారెడ్డి, వెలుగు : సీఎం కప్ 2025లో భాగంగా కామారెడ్డి జిల్లాలో క్లస్టర్, మండల, నియోజక, జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.
<https://satg.telangana.gov.in> లో ఎంట్రీ చేసుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు క్లస్టర్ స్థాయి, మండల స్థాయిలో 28 నుంచి 31 వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు, రాష్ర్టస్థాయిలో 19 నుంచి 26 వరకు క్రీడా పోటీలు ఉంటాయన్నారు.
అథ్లెటిక్స్, వాలీబాల్, సాప్ట్బాల్, విలువిద్య, కబడ్డీ, తైక్వాండో, బ్యాడ్మింటన్, ఖోఖో, బిలియర్డ్స్, స్నూకర్, బాక్సింగ్, జూడో, ఈత, చెస్, కరాటే, కుస్తీ, బేస్బాల్, యోగా, టేబుల్ టెన్నీస్, నెట్ బాల్, స్కేటింగ్, వెయిట్ లిప్టింగ్, జామ్నాస్టిక్, సైక్లింగ్, రోయింగ్, హాకీ, పుట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
