కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాతరాజంపేట, సరంపల్లి, టెకిర్యాల్లో ఆయన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఆయా చోట్ల నిర్వహించిన మీటింగ్ల్లో బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పలువురు షబ్బీర్అలీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంకేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పలువురు చేరుతున్నారన్నారు.
స్టేడియంలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు..
జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి స్టేడియంను పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బర్అలీ మాట్లాడుతూ క్రీడకారులకు అవసరమైన ట్రాక్, డ్రైనేజీ, గ్యాలరీ నిర్మిస్తున్నామన్నారు. పనులు త్వరిత గతిన చేపట్టాలన్నారు. గత ప్రభుత్వాలు క్రీడలను విస్మరించాయన్నారు.
యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్పోర్ట్స్యూనివర్సిటీని ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, డీసీసీ మాజీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్ రావు, టౌన్, రూరల్ పార్టీ ప్రెసిడెంట్లు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఉత్తునూరు రవిపాటిల్, శ్రీనివాస్, షేర్, అన్వర్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
