- ఓటరు లిస్టులో అవకతవకలపై ఆందోళన
- అరగంట పాటు ఉద్రిక్తత
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ను సోమవారం బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఇటీవల ప్రకటించిన ఓటరు లిస్టులో అవకతవకలు జరిగాయని, బోగస్ ఓటర్లను చేర్పించారని వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్లో అరగంటకు పైగా ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ శ్రేణులు ఆఫీస్లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. మెయిన్ డోర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అర గంటకు పైగా తోపులాట జరిగింది.
పోలీసులు బలవంతంగా లాక్కెళ్లుతున్నా తప్పించుకొని వచ్చి మళ్లీ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోగస్ ఓటర్లను తొలగించాలని, వార్డుల వారీగా ఓటర్ల విభజన సరి చేయాలని కోరారు. బీజేపీ శ్రేణులను లింగంపేట, తాడ్వాయి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ నరేందర్రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మోటూరి శ్రీకాంత్, నాయకులు ఆకుల భరత్, నరేందర్, నంది వేణు, అనిత, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
