సూర్యాపేట జిల్లాలో ఉర్సు ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు 

సూర్యాపేట జిల్లాలో ఉర్సు ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు 

 నేరేడుచర్ల (పాలకవీడు) వెలుగు: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మొదలై 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. పార్కింగ్ స్థలం, దర్గా చుట్టుపక్కల శుభ్రం చేశారు. దర్గాకు రంగులు వేసి లైట్లతో అలంకరించారు.

ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు దర్గా ఆవరణలో నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఉర్సులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై లింగయ్య బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లను పాలకవీడు తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో వెంకటాచారి, ఎంపీవో దయాకర్ పర్యవేక్షిస్తున్నారు.