
కామారెడ్డి, వెలుగు : జమ్ము కశ్మీర్లోని పహెల్గాం ఉగ్ర దాడికి ప్రతికారంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేయడం యావత్ దేశం మద్దతు తెలిపింది. దేశ భక్తిని చాటుకునేలా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్లో సిందూర్ వీధిగా నామకణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బోర్డు ఏర్పాటు చేసి పూజలు చేసిన వారిలో వెంకటేశం, తిరుపతిగౌడ్, రాంరెడ్డి, ఆనంద్ రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, తిరుపతిగౌడ్, వెంకటేశం, లింబాద్రి, రామ్చందర్గౌడ్, కృష్ణంరాజు, అంజయ్య, నారాయన్రావు తదితరులు ఉన్నారు.