ప్రాక్టీస్ డుమ్మా కొట్టి షికారుకెళ్లిన క్రికెటర్లు.. పాక్ మ్యాచ్ కు ముందు ఇలానా

ప్రాక్టీస్ డుమ్మా కొట్టి షికారుకెళ్లిన క్రికెటర్లు.. పాక్ మ్యాచ్ కు ముందు ఇలానా

ఆసియా కప్ లో భాగంగా భారత్ -పాకిస్థాన్ జట్లు రేపు సూపర్-4 లో తలపడనున్నాయి. శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతుండగా  కొలొంబోలోని ప్రేమదాస్ స్టేడియం మ్యాచ్ కి ఆతిధ్యమిస్తుంది. లీగ్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అలా కాకుండా ఈ మ్యాచ్ కి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ రిజర్వ్ డేని ప్రకటించింది. దీంతో ఈ మ్యాచ్ లో రిజల్ట్ పక్కా అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొలొంబోలో సూరీడు విజ్రంభిస్తున్నాడు. ఇక అంతా సిద్ధం అనుకుంటున్న సమయంలో టీమిండియాలోని కొంతమంది క్రికెటర్లు ప్రాక్టీస్ మ్యాచ్ డుమ్మా కొట్టేశారు. 

ALSO READ :జట్టు నుంచి తీసేసారు.. అయినా భారత్ గెలవాలని పూజలు చేస్తున్న సీనియర్ క్రికెటర్

కోహ్లీ, రోహిత్, అయ్యర్ నో ప్రాక్టీస్
 
టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ పాక్ తో మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ కి హాజరు కాలేదు. జట్టులో సీనియర్ ప్లేయర్లు గా కొనసాగిస్తున్న వీరు సూపర్-4 మ్యాచ్ కి ముందు ఇలా చేయడం విమర్శలకు దారి తీస్తుంది. పైగా వీరు ముగ్గురు పాక్ తో జరిగిన మ్యాచులో విఫలమయ్యారు. ఎంత స్టార్ ప్లేయర్లు అయినప్పటికీ.. ప్రాక్టీస్ చేయకపోతే రాణించడం కష్టమే. అదికాక పాక్ జట్టులో నాణ్యమైన పేసర్లు ఉండనే ఉన్నారు. ఇక ఈ ప్రాక్టీస్ లో ఇషాన్ కిషాన్, కేఎల్ రాహుల్, శుభమాన్ గిల్ చెమటోడ్చారు. మరి ప్రాక్టీస్ ఎగ్గొట్టిన వీరు రేపటి మ్యాచులో ఏ మాత్రం ప్రభావం చూపిస్తారో చూడాలి.