చెన్నాపురంలో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

చెన్నాపురంలో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

భద్రాచలం, వెలుగు :  తెలంగాణ, -చత్తీస్​గఢ్​ బార్డర్​లోని చర్ల మండలం చెన్నాపురం ఆదివాసీ గ్రామంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్​ కుమార్​ సింగ్​ మంగళవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్​ నిర్వహించారు. ముందుగా గ్రామ అడవుల్లో కూంబింగ్​ నిర్వహించిన అనంతరం గ్రామస్తులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆదివాసీ మహిళలకు, చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. 

నిత్యావసర సరుకులు అందజేశారు. గ్రామంలోని ఆదివాసీ యువకులకు వాలీబాల్​ కిట్లను ఇచ్చారు. ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం, రవాణా లాంటి కనీస సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఏఎస్పీ వివరించారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మావోయిస్టులకు సహకరించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు కేశవ, నర్సిరెడ్డి, సీఆర్​పీఎఫ్​, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.