
ఆసిఫాబాద్, వెలుగు: సైలెన్సర్లు మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. అధిక శబ్ధం వచ్చే 50 బైక్ల మాడిఫైడ్ సైలెన్సర్లను శుక్రవారం వాంకిడి టోల్ ప్లాజా వద్ద రోలర్ తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైలెన్సర్లను మార్చడం చట్టరీత్యా నేరమన్నారు.
ఆసిఫాబాద్ డివిజన్ వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని, మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తామన్నారు. ఆసిఫాబాద్, వాంకిడి, జైనూర్, రెబ్బెన సీఐలు బాలాజీ వరప్రసాద్, సత్యనారాయణ, రమేశ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు