ఒకే ఒక్క ట్రాఫిక్ చలానా.. అతని జీవితాన్ని మార్చేసింది : బండి అమ్మేసి గుర్రం కొన్నాడు..

ఒకే ఒక్క ట్రాఫిక్ చలానా.. అతని జీవితాన్ని మార్చేసింది : బండి అమ్మేసి గుర్రం కొన్నాడు..

దమ్ముంటే ట్రాఫిక్ చలాన్లు పడకుండా రోడ్లపై తిరుగు.. లేటెస్ట్ సవాల్ ఇదే.. బండి కొనటం కామన్ అయినా.. ట్రాఫిక్ పోలీసుల  చలాన్లు పడకుండా రోడ్లపై తిరగటం అసాధ్యం అయ్యింది ఈ కాలంలో. డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా.. ఎక్కడో ఓ చోట సిగ్నల్స్  దాటాం అని.. నో పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేశామంటూ ఫైన్లు బాదేస్తున్నారు. ఇలా విసుగెత్తిన ఓ వాహనదారుడు.. ఏకంగా తన బండిని అమ్మేసి.. గుర్రం కొనుక్కున్నాడు.. ఇప్పుడు చలానా వేయండి అంటూ ఏకంగా ట్రాఫిక్ పోలీసులకే సవాల్ చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అసోం రాష్ట్రం గోపూర్ ప్రాంతానికి చెందిన దిబాకర్ కోయిరాలా.. స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇటీవల ఆయనకు ట్రాఫిక్ పోలీసులు 500 రూపాయల చలానా వేశారు. హెల్మెట్ లేదని ఈ చలానా వేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎందుకు చలానా వేశారంటూ గొడవకు దిగాడు. పోలీసులు మాత్రం డోంట్ కేర్.. ఫైన్ కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. చేసేది లేక ట్రాఫిక్ చలానా కట్టేశాడు. ట్రాఫిక్ పోలీసుల తీరుతో దిబాకర్ కు ఎక్కడో మండిపోయింది.. ఆ తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 

తన బైక్ ను.. టూ వీలర్ ను 80 వేల రూపాయలకు అమ్మేశాడు. ఆ వెంటనే ఆరు వేల రూపాయలకు ఓ గుర్రం కొన్నాడు. ఇంటి నుంచి తన దుకాణానికి.. ఫ్రెండ్స్, హోటల్స్, ఇలా ఎక్కడికయినా గుర్రంపైనే వెళుతున్నాడు. కూరగాయాల మర్కెట్ కు గుర్రంపైనే వెళ్లి.. అక్కడే దానికి ఫుడ్ పెడుతున్నాడు. ఎంతచక్కా రెండు పనులు ఒకేసారి అవుతున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు కోయిరాలా. 

ఇప్పుడు చాలా హాయిగా ఉందని.. హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ట్రాఫిక్ లో ఆగాల్సిన పని లేదు.. పెట్రోల్ బంకులకు వెళ్లాల్సిన పని లేదు.. ట్రాఫిక్ చలాన్లు లేవు.. ఏ గోల లేకుండా హాయిగా ఉందంటున్నాడు. గతంలో పెట్రోల్ కొట్టించుకునేవాడిని.. ఇప్పుడు గుర్రానికి గడ్డి కొంటున్నాను.. అది కూడా సగం ధరలోనే అయిపోతుందంటూ చెప్పుకొస్తున్నాడు దిబాకర్ కోయిరాలా.. 

ఏదిఏమైనా ఒకే ఒక్క చలానా అతని జీవితాన్ని మార్చేసింది.. ప్రశాంతమైన జీవితానికి మార్గం చూపించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.