- రేపు ధన్యవాద తీర్మానం.. ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- ఇరిగేషన్పై సభలో శ్వేతపత్రం విడుదలకు ఏర్పాట్లు
- మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు రిలీజ్ చేసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ఉభయ సభలనుద్దేశించి గవర్నర్తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. గురువారమే బీఏసీలను నియమించి వాటిని సమావేశ పరిచే అవకాశముంది. శుక్రవారం అసెంబ్లీ, కౌన్సిల్ వేర్వేరుగా సమావేశమై గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చించనున్నారు. శనివారం ప్రభుత్వం ఉభయ సభల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సోమవారం నుంచి బడ్జెట్ పై సభ్యులు చర్చిస్తారు. బడ్జెట్ఆమోదం పొందిన తర్వాత ఇరిగేషన్పై శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ఇచ్చిన రిపోర్టును కూడా ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం టేబుల్ చేయనుంది.కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డపై విజిలెన్స్ ప్రిలిమినరీ రిపోర్టును ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.
సమావేశాల నిర్వహణపై సమీక్ష
అసెంబ్లీ, కౌన్సిల్సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆదేశించారు. సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి వారు సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు త్వరగా సమాధాలు వచ్చేలా చూడాలన్నారు. సమావేశాలకు అధికారులు అందుబాటులో ఉండేలా అసెంబ్లీ ప్రాంగణంలోని పాత భవనంలోని మండలిని త్వరగా షిఫ్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని, తర్వాతి సెషన్ అసెంబ్లీ ప్రాంగణంలోనే కౌన్సిల్ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమావేశాలు నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. మండలి సమావేశాలకు మంత్రులు అందుబాటులో ఉండాలని, అసెంబ్లీ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలన్నారు.
ప్రొటోకాల్ తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని శాఖలను కో ఆర్డినేట్చేయడానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్ను ఆదేశించారు. సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు ఇచ్చేలా చూడాలన్నారు. ప్రొటోకాల్ విషయంలో తప్పిదాలు జరగొద్దని, గతంలో తాను కూడా ప్రొటోకాల్విషయంలో బాధితుడినని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త సభ్యులకు రెండు రోజుల పాటు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఫైనాన్స్స్పెషల్ సీఎస్రామకృష్ణారావు, ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్కుమార్, బీర్ల ఐలయ్య, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్చీఫ్ శివధర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పోలీస్కమిషనర్లు పాల్గొన్నారు.