సెంటిమెంట్ కారులో వెళ్లి స్పీకర్ నామినేషన్

సెంటిమెంట్ కారులో వెళ్లి స్పీకర్  నామినేషన్

బాన్సువాడ, వెలుగు : అసెంబ్లీ స్పీకర్  పోచారం శ్రీనివాస్​ రెడ్డి తన పాత అంబాసిడర్  కారులో వెళ్లి నామినేషన్  వేశారు. ఈ కారంటే ఆయనకు  చాలా సెంటిమెంట్. ప్రతి ఎలక్షన్​ టైమ్​లోనూ ఆయన ఆ కారులోనే వెళ్లి నామినేషన్  వేస్తారు. శనివారం కూడా అదే కారులో వెళ్లి నామినేషన్ వేశారు.

1994 ఎన్నికల నుంచి నామినేషన్  వేయడానికి వెళ్లేందుకు పోచారం ఈ కారు వాడుతున్నారు. ఆ తర్వాత ఫార్చ్యునర్, బీఎండబ్ల్యూ లాంటి ఎన్ని కార్లు ఉన్నా పాత అంబాసిడర్  కారులోనే వెళ్లి నామినేషన్  వేస్తున్నారు.