
హైదరాబాద్, వెలుగు: పర్సనల్ కంప్యూటర్ బ్రాండ్ అయిన అసుస్ ఇండియా హైదరాబాద్లో స్టోర్ను లాంచ్ చేసింది. రీఫర్భిష్డ్ ప్రొడక్టులను ఇక్కడ అమ్ముతారు. వినియోగదారులకు తగ్గింపు ధరలలో వివిధ రకాల రీఫర్బిష్డ్ ల్యాప్టాప్లను అమ్ముతారు. అన్నింటికీ ఒక -సంవత్సరం పాటు అసుస్ వారంటీ ఉంటుంది. కొత్త అసుస్ సెలెక్ట్ స్టోర్ 315 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ వివోబుక్, జెన్బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (రోగ్) ల్యాప్టాప్లు, గేమింగ్ డెస్క్టాప్లు, ఆల్ ఇన్ -వన్ డెస్క్టాప్లు సహా ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ హార్డ్వేర్లను ఇక్కడ అందించనున్నారు. అన్ని రకాల తనిఖీలను పూర్తి చేశాకే రీఫర్బిష్డ్ ప్రొడక్టులను అమ్ముతామని అసుస్ తెలిపింది. అసుస్ సెలెక్ట్ స్టోర్లు కోల్కతా, ఢిల్లీ, ముంబైలలో కూడా ఉన్నాయి.