హాస్టల్లో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

హాస్టల్లో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

చిత్తూరు జిల్లా కుప్పంలోని  ద్రవిడ విశ్వ విద్యాలయం అక్కమహాదేవి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్నం భోజనం తిన్న 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఏ విషయం బయటకు రావడం లేదు. అసలు హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. 

ఇవి కూడా చదవండి

శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్​లో సాంకేతికలోప

మీ పిల్లలకు మార్కులు కావాలంటే.. ఓటేయండి

ఇటుక బట్టీలో కోటి రూపాయల డైమండ్

సినీ ఇండస్ట్రీలో మరో మరణం