- ఈడీని డిమాండ్ చేసిన ఢిల్లీ మంత్రి
న్యూఢిల్లీ: మనీలాండరింగ్కు పాల్పడిన బీజేపీ నేతలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి ఆతిశీ కోరారు. శనివారం ఆతిశీ మీడియాతో మాట్లాడారు.
కేవలం అనుమానం ఆధారంగానే ఆప్ నేతలు సంజయ్, సిసోడియా, కేజ్రీవాల్లను ఈడీ అరెస్టు చేసింది. బీజేపీ నేతల వద్ద డబ్బు దొరికినా ఈడీ చర్యలు తీసుకోవట్లే దు” అని ఆతిశీ ఆరోపించారు. బీజేపీ ఆదేశాల మేరకు ఈసీ పనిచేస్తోం దని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్ వంటి సంస్థలను బీజేపీ వాడుకుంటోందని ఆమె విమర్శించారు.