సముద్ర తీరం ఎరుపు రంగు పులుముకుంది. నెత్తుటి అలలతో పోటెత్తింది. తిమింగలాలు, డాల్ఫిన్ల కళేబరాలతో శ్మశానంలా మారిపోయింది. అట్లాంటిక్ దీవుల్లో ఉన్న ఫరో ఐలాండ్లోని స్ట్రీమాయ్ దీవుల రాజధాని తోర్షవ్న్ సిటీ జనం వాటిని వేటాడారు. ప్రతి వేసవిలో తిమింగలాలు, డాల్ఫిన్లు అక్కడికి వలస వస్తుంటాయి. దీంతో జనం వాటిని వేటాడుతుంటారు. అందులో భాగంగానే 200 దాకా తిమింగలాలు, 50 దాకా డాల్ఫిన్లను సముద్రం లోపలి నుంచి తీరానికి తరిమారు. అలా వచ్చిన ఆ జీవుల తలలను తెగనరికారు. వాటి వేటకు ఫరో ఐలాండ్ చట్టం కూడా చేసింది. `వాడే ఆయుధాలు, చంపే పద్ధతిని చెప్పింది.
ఫరో దీవుల మాంసం అవసరాలను తీర్చేందుకు ఏటా 800 దాకా తిమింగలాలు, డాల్ఫిన్లను వేటాడుతుంటారు. తాజా వేటపై బ్లూ ప్లానెట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి 500 దాకా తిమింగలాలు, డాల్ఫిన్లను చంపారని యూరోపియన్ యూనియన్కు సంస్థ ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
కాగా, 16వ శతాబ్దం నుంచే అక్కడ వీటిని
వేటాడుతున్నారు.