కేసు పెట్టడానికొచ్చి కొట్లాట.. తెగిపడిన కానిస్టేబుల్ చేతి వేలు

కేసు పెట్టడానికొచ్చి కొట్లాట.. తెగిపడిన కానిస్టేబుల్ చేతి వేలు

ఖమ్మం: కేసు పెట్టడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లినోళ్లు అక్కడే కొట్లాటకు దిగారు. ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేశారు. విచక్షణా రహితంగా పిడిగుద్దులు, నోటితో కొరకడం లాంటి పిచ్చి పనులు చేశారు. ఈ గలాటాలో ఓ కానిస్టేబుల్ చేతి వేలు తెగి కిందపడింది. ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

తొడ.. చేతి వేళ్లపై కొరికి..

అర్ధ రాత్రి కొంత మంది కంప్లైంట్ ఇవ్వాలంటూ స్టేషన్ కు వచ్చారు. ఆ సమయంలో కానిస్టేబుల్ మసూద్ అలీ డ్యూటీలో ఉన్నారు. కేసు పెట్టాలంటూ మొదలు పెట్టిన వాళ్లు కొద్దిసేపటికి అలీపై దాడికి దిగారు. పైశాచికంగా తొడపై, చేతి వేళ్లపై కొరికారు. ఈ సమయంలో ఆయన చిటికిన వేలు తెగి కిందపడింది. స్టేషన్ లోని మిగతా సిబ్బంది ఆ గొడవ పడుతున్న వారిని అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత కానిస్టేబుల్ మసూద్ అలీని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు. స్టేషన్ లో గొడవ చేసిందెవరు? ఎందుకు జరిగింది? అన్న విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు.