స్టార్టప్ల కోసం ఆగస్ట్ఫెస్ట్.. ఎంట్రప్రెనార్షిప్పై దృష్టి

స్టార్టప్ల కోసం ఆగస్ట్ఫెస్ట్.. ఎంట్రప్రెనార్షిప్పై దృష్టి

హైదరాబాద్, వెలుగు: స్టార్టప్​ ఇన్నోవేటర్ల కోసం హైదరాబాద్​లో ఆగస్టు ఫెస్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఒకప్పుడు ఎంట్రప్రెనార్​షిప్​పై దృష్టిపెట్టిన ఈ ఫెస్ట్ ఇప్పుడు టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తోంది. భారతదేశం 2047 నాటికి 30 ట్రిలియన్​డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. 

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జీడీపీని 2035 నాటికి ట్రిలియన్‌‌‌‌ డాలర్లకు,  2047 నాటికి 3 ట్రిలియన్‌‌‌‌ డాలర్లకు పెంచాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 

దీనివల్ల జాతీయ జీడీపీకి రాష్ట్రం వాటా 5శాతం నుంచి 10శాతంకి పెరుగుతుందని చెప్పారు. స్టార్టప్​ల ద్వారా సమాజానికి మేలు చేసిన ఇన్నోవేటర్లను కూడా సందర్భంగా సత్కరించారు.  ఈ ఫెస్టివల్​లో 250 మంది పెట్టుబడిదారులు,  300 కార్పొరేట్లు పాల్గొన్నారు. 200 స్టాల్స్‌‌‌‌లో స్టార్టప్‌‌‌‌లు వాటి ప్రొడక్టులను ప్రదర్శించాయి.