బిట్​ బ్యాంక్​ : మొఘల్​ సంధి యుగం

బిట్​ బ్యాంక్​ :  మొఘల్​ సంధి యుగం
  •     చిట్టచివరి గోల్కొండ సుల్తాన్​ అబుల్​ హసన్​ తానీషా క్రీ.శ.1699లో దౌలతాబాద్​ కోటలో బందీగా ఉన్నప్పుడు మరణించాడు.
  •     అబుల్​ హసన్​ తానీషా మృతదేహాన్ని ఖుర్దాబాద్​లో అతని గురువు షారాజుకట్టల్​ సమాధి పక్కన సమాధి చేశారు.
  •     గోల్కొండ సుల్తానులు పాలించిన ప్రాంతాలు క్రీ.శ.1687 నుంచి క్రీ.శ.1724 మొఘల్​ వైస్రాయ్​ల పాలనలో ఉంది.
  •     ఔరంగజేబ్​ గోల్కొండను ఆక్రమించిన తర్వాత తాత్కాలిక రాజప్రతినిధిగా రాహుల్లాఖాన్​ను నియమించారు. 
  •     రాహుల్లాఖాన్​ తర్వాత ఔరంగజేబ్​ హైదరాబాద్​ పరిపాలనా బాధ్యతను ఖాన్​సిఫర్​ఖాన్​కు అప్పగించారు.
  •     కౌలాస్​, ఎల్లందల్​, కోయిలకొండ, వరంగల్​, పానగల్​​ కోటలకు ఖాన్​సిఫర్​ఖాన్​ మరమ్మతులు చేయించాడు. 
  •     మొఘల్​ వైస్రాయి ఖాన్​సిఫర్​ఖాన్​ కాలంలో హైదరాబాద్​, కర్ణాటకల్లో తొమ్మిది ఫౌజ్​దారులు ఉండేవారు. 
  •     కుతుబ్​ షాహీల కాలంలో జమీందార్లు పొందిన పన్నులు వసూలు చేసే అధికారులను ఇజారాలు అనేవారు.
  •     మొఘల్​ వైస్రాయిల కాలంలో సర్కారులను జిల్లాలుగా విభజించారు. జిల్లా అధికారిని దేశ్​ముఖ్​ అనేవారు.
  •     ఇజారా పద్ధతిని హైదరాబాద్​ దివాన్ మహమ్మద్​ షఫీ రద్దు చేశాడు. 
  •     క్రీ.శ. 1702లో 50 వేల మంది మరాఠాలు తారాబాయి నాయకత్వంలో హైదరాబాద్​పై దండెత్తి దోచుకున్నారు. 
  •     మరాఠాలు క్రీ.శ.1704లో హైదరాబాద్​పై దండెత్తారు. 
  •     ఔరంగజేబ్​ పాలనలో హైదరాబాద్​ సుబాను బాలాఘాట్​ లేదా పైన్​ఘాట్​ అని పిలిచేవారు. 
  •     ఔరంగజేబ్​ తర్వాత మొఘల్​ సింహాసనాన్ని షా ఆలం అధిష్టించాడు. 
  •     క్రీ.శ.17‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌08లో షా ఆలంకు వ్యతిరేకంగా హైదరాబాద్​లో గోల్కొండ సుల్తాన్​గా ఔరంగజేబ్​ కుమారుడు కాంబక్ష్​ ప్రకటించుకున్నాడు. 
  •     కాంబక్ష్​కు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన 
  • నాయకుల్లో ముఖ్యుడు సర్వాయి పాపన్న. ఈయనది వరంగల్​ జిల్లా ఖిలాషాపూర్​. ఆయన స్వగ్రామం తారికొండ.
  •     తారికొండ తర్వాత సర్వాయి పాపన్న షాపూర్​లో కోటను నిర్మించాడు. 
  •     కొలనుపాక వద్ద జరిగిన యుద్ధంలో పాపన్న అనుచరుడి చేతిలో ఆ ప్రాంత ఫౌజ్​దార్​ ఖాసీంఖాన్​ హతమయ్యాడు. 
  •     క్రీ.శ.1702లో భారీ సైన్యంతో పాపన్న స్థావరంపై దాడి చేసిన హైదరాబాద్​ సుబా డిప్యూటీ గవర్నర్​ రుస్తుందిల్​ఖాన్​. 
  •     క్రీ.శ.1708, ఏప్రిల్​ 1న సర్వాయి పాపన్న వరంగల్​ కోటను ఆక్రమించుకున్నాడు. 
  •     మొదటి బహదూర్​షాకు కాంబక్ష్​కు హైదరాబాద్​ పరిసరాల్లో క్రీ.శ.1709లో యుద్ధం జరిగింది. 
  •     పాపన్నను రాజుగా గుర్తించి మొఘల్​ చక్రవర్తి మొదటి బహదూర్​ షా గౌరవించాడు. 
  •     పాపన్నను బందీగా పట్టుకొని ఫౌజ్​దార్​ యూసఫ్​ఖాన్​ హత్య చేశాడు. 
  •     మొఘల్​ చక్రవర్తి మొదటి బహదూర్​ షా తర్వాత ఫరూక్​ సియార్​ (క్రీ.శ.1713 నుంచి క్రీ.శ.1719) సింహాసనాన్ని అధిష్టించాడు. 
  •     ఫరూక్ సియార్​ కాలంలో దక్కన్​ సుబా, హైదరాబాద్​ పరిపాలన బాధ్యతలను సమర్థవంతులైన సర్ధారులు ముబ్రేజ్​ఖాన్​, మీర్​ ఖమురుద్దీన్​ నిర్వహించారు. 
  •     క్రీ.శ.1713, జూన్​లో హైదరాబాద్​ పాలకునిగా ముబ్రేజ్​ఖాన్​ను ఫరూక్​సియార్​  నియమించారు. ఇతని పాలనలో మరాఠాలు కృష్ణమల్​హర్​ నాయకత్వంలో హైదరాబాద్​పై దండెత్తారు. 
  •     చెంగపెట్టా కోటకు ముబ్రేజ్​ఖాన్​ ఫారూఖ్​నగర్​ అని పేరు పెట్టాడు. 
  •     బహదూర్​ షా మరణానంతరం హసన్​ అలీ, హుస్సేన్​ అలీ అనే సయ్యద్​ సోదరులు కింగ్​ మేకర్​లుగా అవతరించారు. 
  •     క్రీ.శ.1724లో స్వతంత్ర హైదరాబాద్​ రాజ్యాన్ని మీర్​ ఖమ్రుద్దీన్​ (చిన్​ ఖిలిచ్​ఖాన్​) స్థాపించాడు. 
  •     చరిత్ర పుటల్లో మొదటి నిజాం లేదా నిజాం ఉల్​ ముల్క్​గా చిల్​ కిలిచ్​ఖాన్​ ఖ్యాతి గడించాడు. 
  •     క్రీ.శ.1724 నుంచి క్రీ.శ.1948 వరకు నేటి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్నింటిని నిజాం వారసులు పాలించారు. 
  •     నిజాం ఉల్​ ముల్క్​ పూర్వీకుల స్వస్థలం మధ్య ఆసియాలోని సమర్​ఖండ్​ ప్రాంతంలోని బాలాపూర్​ గ్రామం.
  •     ఔరంగజేబ్​ అభిమానం పొంది అతని వద్ద ఘాజీ ఉద్దీన్​, ఫిరోజ్​ జంగ్​ బిరుదులు పొందిన నిజాం ఉల్​ ముల్క్​ తండ్రి షిహాబుద్దీన్​. 
  •     క్రీ.శ.1691లో ఆధోని దుర్గాన్ని మొఘల్​ సేనలు ఆక్రమించినప్పుడు నిజాం ఉల్​ ముల్క్​కు ఔరంగజేబ్​కు ఇచ్చిన బిరుదు చిన్​ ఖిలిచ్​ ఖాన్​. 
  •     క్రీ.శ.1700 నుంచి 1707 మధ్య కాలంలో ఖమ్రుద్దీన్​ బీజాపూర్​ ప్రాంతానికి సుబేదారుగా ఉండేవాడు. 
  •     ఫరూక్​ సియార్​ క్రీ.శ.1713లో ఖమ్రుద్దీన్​ను దక్కన్​ సుబేదార్​గా నియమించాడు.