రెండు T-20 సిరీస్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్,ఆస్ట్రేలియా రెండో T-20 లో భారత్ 4 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 191 రన్స్ ను టార్గెట్ ఇచ్చింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ 38 బంతులలో 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ధోనీ 23 బంతులలోనే 40 పరుగులు చేశాడు. ఇక రాహుల్ హాఫ్ సెంచరీకి చేరువలో 47 పరుగుల దగ్గర అవుట్ కాగా.. ధావన్ 14 పరుగులకే వెనుదిరిగాడు.

