మోడీతో సమోసా తినాలనుంది

మోడీతో సమోసా తినాలనుంది

ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఆదివారం స్వయంగా సమోసాలు తయారు చేశారు. ఈ సమోసాలను ఇండియా ప్రధాని నరేంద్ర మోడీతో కలసి తినాలనుందని మారిసన్ ఆయన తెలిపారు. సమోసాలతో దిగిన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో మారిసన్ పోస్ట్ చేశారు. ఫొటోకు జతగా మంచి క్యాప్షన్ కూడా రాశారు.

‘ఆదివారం మ్యాంగో చట్నీతో సమోసాలు రెడీగా ఉన్నాయి. ఈ వారంలో వీడియో లింక్ ద్వారా నరేంద్ర మోడీని కలువనున్నా. ఆయన వెజిటేరియన్. అందుకే వీటిని ఆయనతో కలసి పంచుకోవడానికి ఇష్టపడతా’ అని మారిసన్ ట్వీట్ చేశారు.