భారీగా పెరిగిన కార్ల ధరలు.. ఏ మోడల్ ఎంత పెరిగిందంటే..?

భారీగా పెరిగిన కార్ల ధరలు.. ఏ మోడల్ ఎంత పెరిగిందంటే..?

హలో ప్రజలారా! కారు కొనాలని, అందులో కూర్చొని నగరమంతా చుట్టేయాలని భావిస్తున్నవారంతా ఒక్క క్షణం ఆగండి. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదే కార్ల ధరల పెరుగుదల గురుంచి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కార్ల ధరలు భారీగా పెరిగాయి. ఎంతలా అంటే.. రూ.8వేల నుంచి మొదలుపెడితే రూ.80వేల దాకా! దీంతో మీరు కొనాలని భావించే కారు వీటిలో ఉంటే మీపై అధిక ప్రభావం పడనుంది.

రాబోయే రెండు నెలల్లో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉండటంతో ఆటోమొబైల్ కంపెనీలు.. కార్ల ధరలను భారీగా పెంచాయి. మహీంద్రా & మహీంద్రా తన థార్, స్కార్పియో, XUV 300 మరియు XUV 700 మోడళ్ల ధరలను రూ. 81,000 వరకు పెంచగా, దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా తన ప్రసిద్ధ SUV సెల్టోస్ మరియు మల్టీపర్పస్ వెహికల్ క్యారెన్స్ ధరలను రూ. 50,000 వరకు పెంచింది. 

ఇక దేశంలోని రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన SUVలు వెన్యూ మరియు టక్సన్ ధరలను రూ.48,000 వరకు పెంచగా.. జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా తన ప్రసిద్ధ సిటీ మరియు అమేజ్ మోడళ్ల ధరలను దాదాపు రూ. 8,000 వరకు పెంచింది. ఈ పెరిగిన ధరలు అక్టోబరు 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి.ఈ ధరల పెంపుతో వినియోగదారులు మరింత నష్టపోవాల్సి వస్తోంది. కావున ధరల పెరుగుదల గురుంచి మరోసారి ఆలోచించి సరైన వాహనాన్ని ఎంచుకోండి.