
న్యూఢిల్లీ: సింగపూర్ నుంచి స్వదేశానికి తిరిగి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం 234 మంది ప్యాసింజర్లతో శుక్రవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిందని సీనియర్ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న మన దేశస్తులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ ను మంగళవారం ప్రారంభించింది. అందులో భాగంగా బీ–787 అనే ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో సింగపూర్ నుంచి మన దేశస్తులు తిరిగి ఇవ్వాళ ఉదయం 11.45 గంటలకు ఇండియాకు చేరుకున్నారు. లాక్ డౌన్ కారణంగా షెడ్యూల్ అయిన అన్ని కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లయిట్ లు రద్దవడంతో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది.